Friday, March 29, 2024

జనవరి 27 నుంచి 31 వరకు పీఠం వార్షికోత్సవం.. తెలంగాణ గవర్నర్‌కు విశాఖ శారదాపీఠం ఆహ్వానం

విశాఖపట్నం-ఆంధ్రప్రభబ్యూరో: విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జనవరి 27 నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతీ ఏటా సాంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ వార్షికోత్సవాలను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పీఠం వర్గాలు భావించాయి. ఇందు కోసం పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రతీ ఏటా పీఠం వార్షికోత్సవాల్లో యజ్ఞయాగాదులు, హోమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ చేపడుతుంటారు.

ఈ నేపధ్యంలోనే శనివారం పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హైదరాబాద్‌లోని రాజభవన్‌కు వెళ్లి తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి వార్షికోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. పీఠం వార్షికోత్సవంతో పాటు రాజశ్యామల యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు పొందాలని తమిళసైను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement