Saturday, April 20, 2024

కడప జిల్లా వైసీపీలో వివాదం.. ఎమ్మెల్యే VS ఎమ్మెల్సీ ఫ్లెక్సీ వార్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైఎస్సార్‌సీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఫ్లెక్సీల చించివేశారు. దీనిపై ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఎమ్మెల్సీ వర్గానికి చెందిన దుగ్గిరెడ్డిపై ఆరోపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఎమ్మెల్సీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రాచమల్లు ఫోటో లేకపోవడంతో ఇలా జరిగిందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement