Saturday, April 20, 2024

12వ తరగతి పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ..

రాష్ట్రాల బోర్డు పరీక్షల వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సిద్దంగా ఉన్న‌ట్టు అస్సాం, పంజాబ్‌, త్రిపుర వెల్ల‌డించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 21 రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక పరీక్షలను ఇప్పటి వరకు రద్దు చేయని రాష్ట్రాలు పంజాబ్, అస్సాం, త్రిపుర, ఏపీ ఉండగా, ఈ నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు జూన్‌ 17వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై సోమవారం కూడా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. ఇవాళ మరోసారి విచారణ చేయనుంది.

కాగా, 12వ తరగతి పరీక్షల విషయంలో 28 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాలు రద్దు చేశాయి. 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించగా, 4 రాష్ట్రాలు రద్దు చేయలేదు. ఈ నాలుగు రాష్ట్రాలకు గత గురువారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కేరళలో 11వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయలేదు. ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ జారీ చేసింది. అయితే అస్సాం, పంజాబ్‌, త్రిపుర రాష్ట్రాలు సైతం పరీక్షలు రద్దు చేస్తామని ప్రకటించాయి. ఇక మిగిలింది ఏపీ రాష్ట్రం. నేటి విచారణలో ఏపీ ప్రభుత్వం నేరుగా కోర్టుకు తెలిపే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement