Thursday, April 25, 2024

ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు యోచనలో బోర్డు..!

ఏపీలో ఇంటర్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే అవకాశం ఇప్పట్లో లేనందున్న పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు చివరకు హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో వెనుకడుగు వేసి వాయిదా వేసింది. అయితే ఇప్పట్లో కరోనా ఉధృతి తగ్గేట్లు లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement