Friday, April 19, 2024

ముళ్లపొదల్లో పసికందు మృత‌దేహం.. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించిన పంచాయ‌తీ సిబ్బంది

బుక్కపట్నం, ప్రభన్యూస్‌: శ్రీసత్యసాయి జిల్లా, బుక్కపట్నం బైపాస్‌ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున స్థానిక సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం వద్ద ముళ్ళ పొదలో కళ్ళు కూడా తెరవని పసికందును పారవేసిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. తమ బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడే తల్లి మనసు. ఈ ఘోర సంఘటన కడు బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చుట్టు-పక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం తెలియజేయగా అక్కడికి చేరుకుని పరిస్థితి గమనించారు. అప్పటికే మృతి చెందిన ఆ పసికందును రెవెన్యూ, పంచాయితీ సిబ్బంది సహకారంతో ఆ పసికందు మృతదేహానికి పంచనామా చేయించి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement