Wednesday, March 27, 2024

స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు దూకుడు పెంచాలి : చంద్ర‌బాబు

అమరావతి: ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాల‌ని.. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దిశానిర్ధేశం చేశారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమ‌య్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో 20 అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆయా విభాగాల బలోపేతం పై చర్చించారు.

ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత ప్రభావవంతంగా పోరాటం చెయ్యాలని అనుబంధ సంఘాల నేతలకు చంద్రబాబు సూచించారు. అనుబంధ విభాగాల పనితీరును సమీక్షించిన చంద్రబాబు…రానున్న రోజుల్లో చేయ్యాల్సిన పోరాటం పై దిశా నిర్థేశం చేశారు. అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టీడీపీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశానికి హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement