Friday, April 19, 2024

తిరుమలలో ఎడతెరిలేని వర్షం.. చలికి ఇబ్బందులు పడుతున్న భక్తులు

తిరుమల ప్రభన్యూస్‌: వాయుగుండం కారణంగా తిరుమలలో మంగళవారం నుంచి అడపా దడపా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఇవ్వాల (బుధవారం) మధ్యాహ్నం ఓ మోస్తరుగా వర్షం కురవడంతో తిరుమల గిరులు తడిసిముద్దయ్యాయి. కాగా ఒక్కసారిగా కురిసిన వర్షానికి శ్రీవారి దర్శనానికి క్యూ కాంప్లెక్సుకు వెళ్ళే భక్తులతో పాటు స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వస్తున్న భక్తులు తడిసి ముద్దయ్యారు.

మరికొంత మంది భక్తులు వర్షానికి పరుగులు తీస్తూ షెడ్లక్రింద దలదాచుకున్నారు. వర్షం కారణంగా తిరుమలలో వాతావరణం పూర్తిగా మారిపోయి చలిగాలులు వీస్తున్నాయి. దీనికి తోడు అప్పుడప్పుడు మంచు పడుతుండడంతో చలితీవ్రతకు తట్టుకోలేక చాలామంది భక్తులు గదులకే పరిమితం అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement