Friday, March 29, 2024

అనుమానపు మొగుడితోపాటు.. అత్తమామలకు.. ఇచ్చిపడేశారుగా..

భార్యపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్న ఓ భర్తతో పాటు అతనికి వత్తాసు పలుకుతున్న అత్తమామలకు కూడా నలుగుపెట్టేశారు ఆ గ్రామస్తులు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని రాఘవేంద్రపురంలో జరిగింది. భర్త ఇంటిపై భార్య బంధువులు దాడి చేశారు.

తాళ్లరేవు మండలం రాఘవేంద్రపురానికి చెందిన మల్లాడి రాజ్ కుమార్ తో కాకినాడ జగన్నాధపురానికి చెందిన కస్తూరి మహాలక్ష్మికి పెళ్లి అయ్యింది. వీరి మద్య రెండు సంవత్సరాలుగా విబేధాలున్నాయి. భార్య కస్తూరి మహాలక్ష్మిపై అనుమానంతో భర్త, అత్తమాములు వేధిస్తున్నారు. తమ ఇంటి ఆడపడుచును వేధింపులకు గురి చేస్తున్నందుకు భర్త రాజ్ కుమార్ కుటుంబంపై కాకినాడ జగన్నాధపురానికి చెందిన కస్తూరి మహాలక్ష్మి తరపు బందువులు దాడి చేసి చితకబాదేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement