Wednesday, April 24, 2024

ప‌వ‌న్ అధికారంలోకి రావాలంటే.. ఆయనపై ఎవ‌రి ప్ర‌భావం ఉండొద్దు… క‌న్నా

జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కే వదిలేయాలని ఆయనపై ఎవ్వరు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండాలంటూ ఏపీ BJP నేత కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బయటనుంచి జనసేనను ఎవ్వరు ప్రభావితం చేయకుండా ఉంటే జనసేన అధికారంలోకి రావటం ఖాయం అంటూ పరోక్షంగా బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పై విమర్శలు చేశారు కన్నా. జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానం చేయించుకుంటున్నారు ? అని ప్రశ్నించారు.

పార్లమెంట్ లో జీవీఎల్ అడిగిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లో కొడితే అర్థమైపోతుంది అంటూ సెటైర్లు వేశారు. అలాగే వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా చేసిన కన్నా వైఎస్సార్ హయాంలోనే కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. కానీ అప్పుడు అది సాధ్యం కాలేదని ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈడీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకుని కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారంటూ కన్నా అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement