Tuesday, April 16, 2024

మన్యంలో అనధికార దత్తత.. ఆడపిల్లను రెండు లక్షలు అమ్మేసిన గిరిజన దంపతులు

ఆడపిల్ల పుట్టిందన్న బాధతో ఓ గిరిజన కుటుంబం చిన్నారిని రెండు లక్షలకు అమ్మేసింది. ఈ ఘటన విశాఖ మన్యంలో జరిగింది. దీనిపై ఇవ్వాల (సోమవారం) MVP పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్​ బుక్​ అయ్యింది. అయితే.. అనధికార పిల్లల దత్తత నిషేధమని, ఇట్లాంటి విషయాలను సీరియస్​గా తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) సభ్యులు, స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సిపిసిఆర్) సభ్యుడు గోండు సీతారాం ఈ ఘటన గురించి ఎంవీపీ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రసాద్‌కు సమాచారం అందించారు.

సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 15వ తేదీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గిరిజన దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను వేరే వారికి ₹ 2 లక్షలకు ఇచ్చారని ఆరోపించారు. ఈ అనధికార దత్తత విషయంలో ఆశ వర్కర్ ప్రమేయం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ఎంవీపీ పోలీసులు తెలిపారు. ప్రజలు తమ ప్రాంతంలో ఇలాంటి అనధికార దత్తతలను గుర్తిస్తే పోలీసులను సంప్రదించవచ్చని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement