Thursday, April 25, 2024

రఘురామ అరెస్ట్… ఏపీ డీజీపీకి నోటీసులు

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనపై జరిగిన థర్డ్ డిగ్రీ జాతీయ స్థాయిలో సంచలనం అయింది. ఎంపీ రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయ్యింది. ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి.. అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీని ఆదేశించింది. రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్ఆర్సీకి కుమారుడు భరత్‌ ఫిర్యాదు  చేయగా.. స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, బెయిల్‌పై విడుదలైన ఎంపీ రఘురామ ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలు

Advertisement