Friday, April 19, 2024

సింహాచలం సబ్‌స్టేషన్‌ లో అగ్నిప్రమాదం

విశాఖ సింహాచలంలోని ట్రాన్స్‌కో సబ్‌ స్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో 10/16 ట్రాన్స్‌ఫార్మర్ ఈ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన సబ్‌స్టేషన్ సిబ్బంది మంటలు మిగతా ట్రాన్స్‌ఫార్మర్లకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement