Thursday, April 25, 2024

వైసీపీ బీసీల‌కు ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలి.. జీవీఎల్

రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు వైసీపీ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీలను మోసం చేసిన‌ వైసీపీ సర్కార్ బీసీ సభ పెట్టిందని ఆరోపించారు. నిధులు, వనరులు లేకుండా బీసీ కార్పొరేషన్లు పెట్టి మోసం చేశారన్నారు. చేనేత, పద్మశాలి, యాదవులకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. అలంకార ప్రాయమైన పదవులతో బీసీలకు ఒరిగేదేమీ లేదని వెల్లడించారు. ఏపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement