Thursday, April 18, 2024

క్వారీ ఘటనలో బాధితులకు హోంమంత్రి పరామర్శ

ప్రత్తిపాడు నియోజకవర్గం యడ్లపాడు క్వారీ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. క్వారీ గుంతలో పడి నలుగురు యువకులు మృతి చెందిన వార్త విష్మయానికి గురిచేసిందన్నారు. చనిపోయిన యువకుల కుటుంబసభ్యులను హోంమంత్రి సుచరిత స్వయంగా కలిసి తన ప్రగాడ సానిభూతిని తెలిపారు. క్వారీల దగ్గర తరచూ ఇలాంటి ఘటనలు జరడగం బాధాకరమన్నారు. క్వారీల దగ్గర ఎంత లోతు ఉందనే విషయాన్ని తెలుపుతూ సైనింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ క్వారీ నిర్వహించే వారు క్వారీ చుట్టూ పెన్సింగ్ చేయించడం, పెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయడం వలన ఇలాంటి ప్రమాదలను అరికట్టవచ్చు తెలిపారు. ప్రభుత్వం తరపున ఈ యువకుల కుటుంబాలకు చేతనైనంత సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement