Saturday, April 20, 2024

కరుడుగట్టిన ఇంటి దొంగలు అరెస్ట్..

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్: కరుడుగట్టిన ఇంటి దొంగలను అరెస్టు చేసినట్లు తిరుప‌తి ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల‌ సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి భవాని నగర్ కు చెందిన ఈశ్వర్ దాము (32), గాంధీ కాలనీకి చెందిన షణ్ముగం (44)ను సత్య నారాయణపురం జంక్షన్ వద్ద అరెస్ట్ చేసిన‌ట్టు చెప్పారు.

నిందితుల నుంచి ఒక కేజీ రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన గ్యాస్ కట్టను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేసి ఇప్పటికీ పలు సార్లు జైలు శిక్ష కూడా అనుభవించార‌ని డీఎస్పీ చెప్పారు. ఇద్దరిపై తిరుపతి జిల్లాలోని ప‌లు పోలీస్టేష‌న్ల‌లో కేసులు ఉన్నాయ‌న్నారు. ఈశ్వర్ పై 24 కేసులు, షణ్ముగంపై 4 కేసులు ఉన్నాయ‌ని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement