Friday, April 19, 2024

AP: వైసీపీ పాలనలో రైతులకు అధిక దిగుబడి… జోగి రమేష్

రైతులకు వైసీపీ పాలనలో దిగుబడి అధికంగా వచ్చిందని, మద్దతు ధర కూడా లభించిందని ఏపీ మంత్రి జోగి రమేష్ తెలిపారు.వేసవి తరువాత కృష్ణానది నుంచి నీటిని విడుదల చేశారు మంత్రలు అంబటి రాంబాబు, మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. గతంలో కంటే త్వరగా నీటి విడుదల చేసామన్నారు. వరుణ దేవుడి ఆశీస్సులతో ప్రాజెక్టులన్నీ జల కళతో నిండిపోయాయని అన్నారు. ఇవాళ కృష్ణా డెల్టా వాసులకు పండుగరోజు అని ఆయన పేర్కొన్నారు.పులిచింతల నిర్మాణం వైఎస్ఆర్ చేసారని, ఢిల్లీ వెళ్ళి ఏం సాధించారని కొందరు అంటుంటారన్నారు. 12,900 కోట్లు పోలవరం కోసం కేంద్రం నుంచి సాధించారు సీఎం జగన్ అని ఆయన తెలిపారు. పోలవరం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement