Thursday, April 25, 2024

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ఇటీవల ఏపీపీఎస్సీ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ పరీక్షను ఇంగ్లీష్‌ మీడియంలోనే రాయాలని పేర్కొంది. అయితే దీనిపై ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ కోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. కేంద్రం జారీ చేసే నోటిఫికేషన్లు హిందీలో కూడా ఉంటాయని చెప్పారు. లాయర్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement