Wednesday, April 17, 2024

అత‌నికి 40, అమ్మాయికి 20, ఇద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్‌.. ఇక్క‌డే మ‌రో ట్విస్టు!

పాయకాపురం, (ప్రభా న్యూస్): ఎన్‌టీఆర్ జిల్లాలో వింత ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. జిల్లాలోని నున్న పోలీస్ స్టేషన్లో బుధవారం రెండు ఇన్సిడెంట్లు చోటు చేసుకొన్నాయి. వాంబే కాలనీలో ఉంటున్న రెండు కుటుంబాల మధ్య పరిచయాలతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే.. అబ్బాయి వయస్సు (40), అమ్మాయి వయస్సు (20).. కాగా, వీరిద్దరి మధ్య ఇరవై సంవత్సరాల తేడా ఉంది. వీరిద్దరూ ఇంటి నుండి బయటకు వచ్చి ప్రేమ వివాహం చేసుకొని పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడాను తెలియ‌జేస్తూ అభ్యంతరం తెలిపారు.

అయినా.. సరే పోలీసులు వారికి రక్షణగా నిలిచారు. ఇంకో విష‌యం ఏమిటంటే అబ్బాయికి పెళ్లి అయి పిల్లాడు కూడా ఉన్నాడు. ఇక అమ్మాయి విషయానికి వస్తే ప్రస్తుతం డిగ్రీ చ‌దువుతోంది. ఆ పెళ్లైన వ్యక్తి అంటేనే ఇష్టమని చెబుతూ పోలీస్ స్టేషనకు వచ్చింది. దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇచ్చి ప్ర‌స్తుతానికి ఇంటికి పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement