Wednesday, April 24, 2024

ఏపీ సమాచార కమీషనర్ల ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కమిషనర్లుగా నియామితులైన ఉల్చల హరిప్రసాద్ రెడ్డి,కాకర్ల చెన్నారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ వారితో ప్రమాణం  చేయించారు. శుక్రవారం అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇరువురు నూతన కమీషనర్లకు సీఎస్ పుష్పగుచ్చాలను అందించి ప్రభుత్వం తరుపున సత్కరించి అభినందనులు తెలిపారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత పటిష్టవంతంగా అమలు జరిగేలా నూతన కమీషనర్లు తమవంతు కృషి చేయాలని సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆకాంక్షించారు. సమాచార హక్కు చట్టం  ప్రజలకు ఒక వరం వంటిదని వారి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు సమాచార కమీషనర్లు అన్ని విధాలా కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ ఆదిత్యానాద్ దాస్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement