Thursday, March 28, 2024

Flash: విశాఖలో కరోనా డేంజర్ బెల్స్.. జీవీఎంసీ కమిషనర్ కి పాజిటివ్

విశాఖలో కరోనా డేంజర్ బెల్ మోగుతోంది. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీశాకు కరోనా పాజిటివ్ సోకింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుపతిరావుకు మరోసారి కరోనా సోకడంతో ఆయన చికిత్స పొందుతన్నారు. ఆయన స్థానంలో డాక్టర్ విజయలక్ష్మికి బాధ్యతలప్పగించారు.  రోజుల వ్యవధిలోనే  ఇద్దరు అధికారులకు పాజిటివ్ సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం ఒక్కరోజు వ్యవధిలోనే జిల్లాలో 183కేసులు  నమోదు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలోనే అత్యధికంగా యాక్టివ్ కేసులుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement