Saturday, April 20, 2024

తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరా నిలిపివేస్తారా?: వైసీపీపై జీవీఎల్ ఆగ్రహం

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది నివాసం ఉండే క్వార్టర్స్ కు నీటి సరఫరా నిలిపివేయడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, సిబ్బంది క్వార్టర్స్ కు వైసీపీ నేతలు నీటి సరఫరా నిలిపివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. రోడ్లు తవ్వేయడం దారుణం అని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ఈ అంశంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాకు లేఖ రాశాననని చెప్పారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరినట్లు జీవీఎల్ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement