Wednesday, April 24, 2024

రేపే ఎపిలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌లు…

అమ‌రావ‌తి – ఎపిలో రేపు జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు హైకోర్టు డివిజ‌న్ బెంచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది… హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను కొట్టివేసింది.. దీంతో రేపు య‌థావిధిగా పోలింగ్ జ‌ర‌గ‌నుంది.. కాగా, ఈ ఎన్నిక‌ల‌పై టిడిపి హైకోర్టును ఆశ్ర‌యించింది.. దీనిని విచారించిన సింగిల్ బెంచ్ ఈ ఎన్నిక‌ల‌పై స్టే ఇచ్చింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం డివిజ‌న్ బెంచ్ ను ఆశ్ర‌యించింది.. ముఖ్యంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కు నాలుగు వారాలు గ‌డువు ఉండాల‌ని సుప్రీం తీర్పుపై నే వాదన‌లు జ‌రిగాయి.. ఈ గ‌డువు గరిష్ట‌మే త‌ప్ప అన్ని రోజులే ఉండాల‌నేది సుప్రీం కోర్టు త‌న తీర్పులో పేర్కొన‌లేద‌ని ఎన్నిక‌ల సంఘం త‌రుపు న్యాయ‌వాది వాదించారు.. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న డివిజ‌న్ బెంచ్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement