Friday, April 19, 2024

రాజధానిపై మాటమార్చిన వైసీపీ.. పవన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిపై వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ… గతంలో అమరావతి రాజధానికి మద్దతిచ్చి.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారన్నారు. సభలో ఇచ్చిన మాటకు విలువ లేకుండా చేస్తున్నారన్నారు. చట్టసభల్లో చేసిన చట్టానికి విలువ లేనప్పుడు వైసీపీకి పాలించే హక్కు లేదన్నారు. జనసేన ఎమ్మెల్యేలు పది మంది ఉంటే గట్టిగా పోరాడే వాళ్లమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement