Thursday, April 25, 2024

డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతికి ఉగాది పురస్కారం

చిలకలూరిపేట, మార్చి 22 (ప్రభ న్యూస్) : పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ఏ ఎం జి డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. నరసరావుపేట పట్టణంలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన ఉగాది వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందజేశారు. రాష్ట్ర జలవ వనరుల శాఖ మంత్రి‌ అంబటి రాంబాబు, జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, అదనపు ఎస్పి బిందు మాధవ్ లు సత్కరించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఏఎంజీ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, సంస్థలో చేరకముందు బ్యాంకింగ్ రంగంలో ఆయన అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగతంగా డాక్టర్ అరుణ్ కుమార్ కంటి మహంతికి ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement