Thursday, April 25, 2024

ఆటో – కారు ఢీః ముగ్గురు దుర్మ‌ర‌ణం….

గుంటూరు – సత్తెనపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. సత్తెనపల్లి, గుంటూరు ప్రధాన రహదారిపై నందిగామ అడ్డరోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో ను కారు ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20మంది వరకు కూలీలు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. వారంతా మాదల గ్రామానికి చెందిన వారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement