Friday, March 29, 2024

బైకు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్టు.. 9 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

తెనాలి (ప్రభ న్యూస్): ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డి.ఎస్.పి స్రవంతి రాయ్ పేర్కొన్నారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పని చేసుకుంటూ జీవన సాగిస్తున్న యువకులు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ చోరీకి పాల్పడినట్లు డిఎస్పి తెలిపారు. నలుగురు వ్యక్తులకు గాను సల్మాన్ రాజు, యేసు కళ్యాణ్, కరిముల్లా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని, ఒకరు పరారీ లో ఉన్నారన్నారు.

నిందితుల నుంచి పట్టుబడిన తొమ్మిది ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. ఈ వాహనాల చోరీకి సంబంధించి చుండూరు, తెనాలి టౌన్, తెనాలి రూరల్, నల్లపాడు, చెరుకుపల్లి సంబంధిత స్టేషన్లో కేసులు నమోదయ్యాయన్నారు. చోరీ చేసిన ఈ ద్విచక్ర వాహనాల‌ విలువ సుమారు 7.50 లక్షలుంటుందని అన్నారు. సమావేశంలో వన్టౌన్ సీఐ కొమ్మలపాటి చంద్రశేఖర్, ఎస్సై ఉమామహేశ్వరావు,సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement