Thursday, April 18, 2024

ఈతకు వెళ్లి యువకుడి గల్లంతు.. గుంటూరు జిల్లాలో ఘటన

ప్రత్తిపాడు, (ప్రభ న్యూస్) : ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. కొండేపాడు గ్రామానికి వెళ్లే దారిలో టెంట్ హౌస్ లో పనిచేస్తున్న షేక్ నాగుల్ మీరా (25), పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తూ తన స్నేహితులు మరో ఇద్దరితో కలిసి నీళ్ల కుంటలోకి ఈతకు దిగి గల్లంతయ్యాడు. స్నేహితులు ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన నాగుల మీరాను బయటకు తీయడం కోసం కుంటలోని నీళ్లను బయటకు పంపించే పనులు స్థానికులు చేపట్టారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సీహెచ్ ప్రతాప్ కుమార్ సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement