Wednesday, April 24, 2024

షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌లు…తేల్చేసిన జ‌గ‌న్

అమ‌రావ‌తి – క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హించ‌డంపై పునం స‌మీక్ష చేయాల‌ని హైకోర్టు చేసిన సూచ‌న‌ను ఎపి స‌ర్కార్ అమ‌లుచేసేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు…విద్యార్థుల భవిష్యత్‌ కోసమే టెన్త్, ఇంటర్మీడియట్‌ పరీక్షలు నిర్వహిస్తుననామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ‘మనబడి నాడు–నేడు’పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నిన్న కేరళలో టెన్త్‌ పరీక్షలు పూర్తిచేశారు. టెన్త్‌ ఇంటర్‌ పరీక్షలల నిర్వహణపై కేంద్రం ఎలాంటి విధానాలు ప్రకటించలేదు. పరీక్షల నిర్ణయాన్ని కేంద్రం.. రాష్ట్రానికే వదిలేసింది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు లేకపోతే మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయి..? పాస్‌ మార్కులతో బయటపడ్డ విద్యార్థుల భవిష్యత్‌ ఏంటి..? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలి’ అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. కాగా, ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ తీసుకుంటున్న జాగ్ర‌త్త‌ల గురించి హైకోర్టులో అఫిడివిట్ దాఖ‌లు చేస్తామ‌ని విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement