Saturday, April 20, 2024

ప్రలోభాలకు లోనై పార్టీల మార్పు..

బాపట్ల – నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు లోను చేసి పార్టీ మార్చుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మండిపడ్డారు. మంగళవారం స్థానిక వేగేశ్న ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల విలువలను కాపాడాలని దౌర్జన్యాలకు,ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఎవరు నష్టపోకుండా ఎన్నికలను తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిష్కరించారన్నారు.అయితే కొందరు మాత్రం వ్యక్తిగత,పార్టీ పరంగా క్యాడర్ పరంగా వ్యతిరేకత వస్తుందని ఎన్నికలలో పోటీ చేస్తున్నామని కర్లపాలెం మండలంలో నాలుగు స్థానాలలో పోటీ చేస్తున్నారని తెలిపారు.బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అత్యున్నత స్థానంలో ఉండి కూడా చీకటి ముసుగు రాజకీయాలు చేయడం హేమమైన చర్య అన్నారు. రాత్రి వేళల్లో టిడిపి నాయకుల ఇళ్లకు వైసిపి నాయకులను పంపించి అక్కడే కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడంను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి ఇద్దరు నాయకులు విడిచి వెళ్ళినా కూడా ధైర్యాన్ని కోల్పోమని, మరింత బలంగా తయారవుతామని వివరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగడతామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement