Sunday, March 24, 2024

ప్రత్తిపాడు లో తారకరత్నకు ఘన నివాళి…

ప్రత్తిపాడు ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్): నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారకరత్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.సెంట్రల్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి మాట్లాడుతూ తారకరత్న చనిపోవడం తెలుగుదేశం పార్టీకి,నందమూరి అభిమానులకు తీరని లోటని గత నెల యువ గళం పాదయాత్రలో పాల్గొని హార్ట్ ఎటాక్ తో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మరల తిరిగి వస్తాడు అని అనుకున్నామని ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.రాష్ట్ర రైతు విభాగం మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం కార్యకర్తలు,నందమూరి అభిమానులుకు తారకరత్న మృతి తీరని లోటు అని భావోద్వేగానికి గురియ్యారు.ఈ కార్యక్రమములో ఎస్సీ సెల్ అధ్యక్షులు డక్కుమల్ల భాగ్యరావు,వెలివెల్లి వెంకట సుబ్బారావు,చాగంటి శ్రీనివాసరావు,శ్యాంబాబు, కాసు పెంటారెడ్డి,శివానందం, మైనార్టీ ఉపాధ్యక్షుడు మీరాసా,సాంబయ్య, వాసిమళ్ళనాగరాజు తదితర నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement