Wednesday, April 24, 2024

వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం….

బెల్లంకొండ – వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని బెల్లంకొండ ఎస్ ఐ ఎస్. రాజేష్ అన్నారు. శనివారం స్థానిక బెల్లంకొండ ప్రధాన కూడలి ఆవరణలో దుగ్గి ఇస్సాకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బెల్లంకొండ ఎస్ ఐ ఎస్ .రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ రాజేష్ మాట్లాడుతూ దుగ్గి ఇస్సాకు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం,వివిధ పనుల నిమిత్తం బెల్లంకొండ ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో పాటు బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంఅభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దుగ్గి ముక్కంటి, దుగ్గి యాకోబు, దుగ్గి సురేష్, దుగ్గి అశోక్,దుగ్గి మోషే, దుగ్గి వంశీ, కొదమల నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement