Saturday, April 20, 2024

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

బాపట్ల కోవిడ్ కేంద్రాలలో చికిత్స పొందే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగుల వివరాలతో పాటు వైద్య సదుపాయం,ఆహార సదుపాయం పై కోవిడ్ సెంటర్ ఇంచార్జ్ టిపిఓ శ్రీలక్ష్మిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు అందించే ఆహారం పై ఎటువంటి సమస్యలు తలెత్తినా,నాణ్యత ప్రమాణాలు లోపించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ఏరియా వైద్యశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి చేస్తున్న సేవలపై వైద్యాధికారులు అడిగి తెలుసుకున్నారు.రోజురోజుకీ పెరుగుతున్న కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ,ఆ ప్రాంతాల్లో ప్రజలకు జాగ్రత్తలు తీసుకునే విధంగా కరోనా పై అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, తహసిల్దార్ శ్రీనివాస్ ఆర్ఐ సురేష్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement