Saturday, April 20, 2024

ఆరుగురు వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవం….

అమ‌రావ‌తి – శాస‌న మండ‌లికి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌లో వైసిపి మొత్తం ఆరు స్థానాల‌ను ఏక‌గ్రీవంగా కైవ‌సం చేసుకుంది.. ఆ పార్టీ అభ్య‌ర్ధులు మహమ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, చల్లా భగీరథ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌, సి.రామచంద్రయ్యలు త‌మ నామినేష‌న్ ల‌ను గురువారం దాఖ‌లు చేశారు.. ఆరు స్థానాల‌కు ఆరుగురు అభ్య‌ర్ధులే నామినేష‌న్ లు వేయ‌డంతో ప‌రిశీల‌న అనంత‌రం నేడు వారంతా ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు మండ‌లి కార్య‌ద‌ర్శి ప్ర‌క‌టించారు.. ఈ ఆరు స్థానాలు గెల‌పుతో శాస‌న‌మండ‌లిలో వైసిపి బ‌లం 18కి చేరింది. ప్ర‌స్తుతం మండ‌లిలో టిడిపి బ‌లం 26 కాగా, ప్రోగ్రసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు ఐదుగురు, బీజేపీ మూడు, ఇండిపెండెంట్లు ముగ్గురు వున్నారు. మరో మూడు ఖాళీలకు ఎన్నికలు జరగాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement