Friday, April 19, 2024

శతాధిక వృద్ధుడు, సీనియ‌ర్ రాజ‌కీయ నేత యడ్లపాటికి క‌రోనా వ్యాక్సిన్..

గుంటూరు – కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జాగ్రత్తలు పాటించటంతో పాటు వాక్సినేషన్ పై ప్రభుత్వం విస్తృతంగా అవగాహన కలిగిస్తోంది. అయినప్పటికి చాలామందిలో వాక్సినేషన్ పై అపోహలు పూర్తిగా తొలగిపోవటం లేదు. ప్రజల్లో వున్న భయాందోళనలు పోగొట్టేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తో పాటు ఎంతోమంది ప్రముఖు వాక్సినేషన్ తీసుకున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్రముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి సైతం 1 వ తేదీన గుంటూరులో వాక్సినేషన్ తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయనాయకులు, ప్రముఖులు, అధికారులు వాక్సినేషన్ తీసుకుని ప్రజలలో నెలకొని వున్న భయాందోళనలు పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్నో కీలకపదవులు నిర్వహించిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, శతాధిక వృద్ధుడు యడ్లపాటి వెంకటరావు వాక్సినేషన్ వేయించుకున్నారు. నూరేళ్ళకు పైబడిన యడ్లపాటి వంటి ప్రముఖులు సైతం కోవిడ్ వాక్సినేషన్ వేయించుకోవటం ద్వారా ప్రజలలో అవగాహన, స్ఫూర్తిని పెంపొందించినట్టయింది అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఈ సందర్భంగా యడ్లపాటిని పలువురు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement