Saturday, April 20, 2024

హైకోర్టు స్టే పై డివిజ‌న్ బెంచ్ లో ఎన్నిక‌ల క‌మిష‌న్ అప్పీల్…

అమ‌రావ‌తి – ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వుల‌ను స‌వాలు చేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ డివిజ‌న్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది.. ఈ మేర‌కు హౌజ్ మోష‌న్ పిటిష‌న్ ను దాఖ‌లు చేసింది.. దీనిపై విచార‌ణ ఈ రాత్రికి జ‌రిగే అవ‌కాశాలున్నాయి.. కాగా, ఎపిలో జ‌డ్పీటిసి, ఎంపిటిసి ఎన్నిక‌ల‌కు విడుద‌లైన నోటిఫికేష‌న్ పై హైకోర్టు స్టే విధించింది..దీంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు మ‌రోసారి బ్రేక్ ప‌డిన‌ట్లైంది.. దీంతో ఈ ఎన్నిక‌ల‌కు ఈ నెల 8వ తేదిన జ‌ర‌గాల్సిన పోలింగ్ నిలిచిపోయింది. ఈ నెల ఒక‌టో తేదిన కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నోటిషికేష‌న్ విడుద‌ల‌ చేశారు.. గ‌తంలో ఆగిపోయిన చోటు నుంచే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఈ నోటిఫికేష‌న్ లో పేర్కొన్నారు.. కాగా నీలం సాహ్ని విడుదల చేసిన నోటిఫికేషన్ పై టిడిపి, జనసేన, బిజెపిలతో సహా పలువురు హైకోర్టు ను ఆశ్రయించారు.. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా ఈ నోటిఫికేష‌న్ ఇచ్చారంటూ పిటిష‌నరులు త‌మ‌ వాదనలను హైకోర్టులో వినిపించారు.. దీనిని హైకోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియ నాలుగు వారాలు ఉండాలని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింద‌ని అందుకు విరుద్ధంగా కేవలం 15 రోజులలో ఈ ఎన్నికల ప్రక్రియే విధంగా గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటీఫికేషన్ విడుదల చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది..సుప్రీం కోర్టు విధివిధానాలు పాటించడం లేదని భావించిన హైకోర్టు ఈ నోటిఫికేషన్ పై స్టే ఇచ్చింది.. ఈ నెల 15వ తేది లోగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టిడిపి, బిజెపి, సిపిఐ లు హర్షం వ్యక్తం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement