Sunday, March 24, 2024

ప‌వ‌న్ ది ప‌గ‌లు ఒక పార్టీ, రాత్రి మ‌రో పార్టీ – సజ్జ‌ల‌

అమ‌రావ‌తి – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకనే పవన్‌ కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. తాడేప‌ల్లి పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,. ‘‘బీజేపీ, జనసేన మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది. సీఎం జగన్‌ని ఎదుర్కొలేకనే తెర వెనక రాజకీయాలు నడుపుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు సొంత అభిప్రాయం అంటూ ఏమి లేదు. ఆయన రాత్రి ఓ పార్టీతో.. పగలు ఓపార్టీతో తిరుగుతుంటారు’’ అని సజ్జల విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు సీఎం జగన్‌కు అండగా నిలిచార‌న్నారు. . ఓట్ల రూపంలో తమ ఆశీర్వాదాన్ని తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను మెచ్చి జనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం కట్టబెట్టారని గుర్తు చేశారు… తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామ‌నే ధీమాను వ్య‌క్తం చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement