Saturday, April 20, 2024

కాల్వ అంచులోకి బస్సు.. 28 మంది ప్రయాణికులకు..

గుంటూరు జిల్లా తెనాలిలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెదరావూరు వద్ద కాల్వ అంచులోకి బస్సు ఒరిగిపోయింది. తెనాలి నుండి ప్రయాణికులతో భట్టిప్రోలు – రేపల్లె వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్రేన్ సహాయంతో మళ్లీ బస్సును రోడ్డుపైకి తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement