Thursday, April 25, 2024

మంగ‌ళ‌గిరికి చేరుకున్న ప‌వ‌న్.. న్యాయ‌వాదుల‌తో భేటీ..

విశాఖ ఘ‌ట‌న‌లో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈవిష‌య‌మై పోలీసులు కేసులు సైతం న‌మోదు చేశారు. ఇందులో భాగంగానే మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో న్యాయ‌వాదుల‌తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ ఘటనలో కేసులు ఎదుర్కోవటంపై చర్చ నిర్వహించనున్నారు. నేడు హైకోర్టులో జనసేన పిటిషన్ విచారణకు రానున్నారు. జనసేన కార్యకర్తలపై నమోదైన కేసులపై పిటిషన్ దాఖలు చేశారు. కేసును రద్దు చేయాలంటూ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇదిలా ఉంటే మరి కాసేపట్లో పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement