Thursday, April 25, 2024

కొత్త ఏడాదిలో అందరికీ ఆరోగ్యం – ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి -తెలుగు వారందరి కీ కొత్త వసంతంలో తొలి పండుగ ఉగాది అని, ఈ పర్వదినాన ప్రజలంతా కరోనా ముప్పు నుంచి క్షేమంగా బయటపడాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలం దరికీ ఆయన శుభాకాంక్ష లు తెలియజేశారు. శ్రీ ప్లవ నామ ఉగాదిలోని ప్లవ అంటే దాటించేదని, ప్రజల కష్టాలను, కరువు కాటకాల నుంచి ముఖ్యంగా కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ క్షేమంగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరికీ ఈ ఉగాది ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్లుగా పవన్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement