Tuesday, April 23, 2024

అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్​కు పవన్ క‌ళ్యాణ్‌ ఆర్థిక సాయం

ఇటీవల ముగిసిన అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలవడంలో రషీద్ ముఖ్యభూమిక పోషించాడు. ఎంతో నిలకడ ప్రదర్శించడంతో పాటు, తన ఆటతీరుకు దూకుడు మేళవించి భవిష్యత్ స్టార్ గా గుర్తింపు పొందాడు. భారత అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్‌ కల్యాణ్‌ తరఫున చెక్కును అందజేశారు. పవన్ కల్యాణ్‌ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు.జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్‌ కల్యాణ్‌ తరఫున చెక్కు ఇచ్చారు. పవన్ తరపున అభినందనలు తెలిపారు. త్వరలో రషీద్‌ను పవన్‌ కలుస్తారని పార్టీ నేతలు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement