Monday, March 25, 2024

ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం..

పల్నాడులోని గురజాలలో విషాదం చోటుచేసుకుంది. మదర్సాలో కలుషిత ఆహారం తిని ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. మదర్సాలో మొత్తం ఆరుగురు కలుషిత భోజనం చేయగా అది కాస్త ఫుడ్ పాయిజన్ అయ్యింది. విషయం తెలుసుకున్న సిబ్బంది వీరిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్లకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement