Friday, March 29, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నారై మహిళ మిస్సింగ్..

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నారై మ‌హిళ మిస్సింగ్ అయ్యింది. మూడు రోజులు దాటినా మ‌హిళ ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలానికి చెందిన ఓ ఎన్నారై మహిళ అమెరికాలో న్యాయవాదిగా పని చేస్తున్నారు. అక్టోబర్ 29న ఆమె అమెరికా నుంచి సొంత ఊరికి వ‌చ్చింది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆమె బ‌స్సులో విజయవాడకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఆమె కోసం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫోన్ ను కూడా ఇంటి వద్దే వదిలి వెళ్లారు. తన పాస్ పోర్టును మాత్రం తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement