Tuesday, March 26, 2024

జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌కు నగిషీ…

ఇళ్ల పట్టాల కోసం లక్ష కొత్త దరఖాస్తులు
అర్హులందరికీ లబ్ధి అందాలి
ఏప్రిల్‌ నెలాఖరులోగా పంపిణీ చేయండి
ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
మూడు కేటగిరీలుగా దరఖాస్తులు, వినతుల వర్గీకరణ
ప్రాధామ్యాల వారీగా పరిష్కారం.. ఎప్పటికప్పుడు ట్రాకింగ్‌
స్పందన పోర్టల్‌ ఆధునికీకరణ.. ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి, : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నవరత్నాలు పేరిట అమలు చేస్తున్న పథకాలు మరింత మెరవాలని, ఆ మేరకు కలెక్టర్లు బాధ్యత తీసుకుని అర్హులైన వారందరికీ నవరత్నాలు అందజేసే బాధ్యతను నెత్తికెత్తుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూచించారు. ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కొత్తగా వచ్చిన దర ఖాస్తులను వెంటనే పరిష్క రించి వచ్చే నెలాఖరులోగా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. సుమారు లక్ష వరకూ ఇంటి స్థలాల కోసం దర ఖాస్తులు మళ్లీ వచ్చాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ వెరి ఫికేషన్‌ చేశామని తెలిపారు. మొత్తం దరఖాస్తులన్నంటినీ కూడా మరోసారి వెరిఫై చేసి, అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దరఖాస్తులను తిరస్క రించేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలిం చాలన్నారు. అర్హులుఎవ్వరూ మిగిలిపోకూడదని అన్నారు. నవ రత్న పథకాల సోషల్‌ ఆడిట్‌ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిసిన వెంటనే చర్యలు తీసుకోవాలని, అయినప్పటికీ ఎవరైనా మిగిలిపోయిన పక్షంలో పథకం అమలు చేసిన తేదీ నుంచి నెలరోజుల పాటు- వారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలన్నా రు. తర్వాత నెలలో వెరిఫికేషన్‌ చేయాలని తెలిపారు. వాటిని వెంటనే పరి ష్కరించి.. మూడో నెలలో వారికి నిధులు విడుదల చేయాలన్నారు. అప్పటితో ఆ స్కీం సంపూర్ణంగా ముగిసి నట్టు- అవుతుందని తెలిపారు.
ఫిర్యాదులు.. ట్రాకింగ్‌
గ్రామ సచివాలయాల ద్వారా కాని, కాల్‌ సెంటర్‌ ద్వారా కాని, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా కాని, మొబైల్‌ యాప్‌ ద్వారా కాని, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉందని, అలా తీసుకున్న వినతులు అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరణ చేశామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టంచేశారు. తాము ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మూడు ఆప్షన్స్‌ ఉంటాయని, వెబ్‌ లింక్‌ ద్వారా లేదా 1902కు కాల్‌చేసి లేదా, గ్రామ సచివాలయాల ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించామన్నారు. తాము చేసిన వినతి పరిష్కారం పట్ల పౌరుడు సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ అదే ఫిర్యాదును ఓపెన్‌ చేసి జిల్లాస్థాయిలో లేదా విభాగాధిపతి స్థాయిలో మళ్లీ విజ్ఞాపన చేయవచ్చని పేర్కొన్నారు. ఈక్రమంలోనే సేవలపట్ల పౌరుడు నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకుంటారని సీఎం జగన్‌ తెలిపారు. వినతుల పరి ష్కారంలో పురోగతి ఉందా.. లేదా.. అని తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తామని, అలాగే థర్డ్‌ పార్టీ ఆడిట్‌కూడా జరుగుతుందని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, పౌరులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసుకోవాలని సూచిం చారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్‌ చేయాలని సూచిం చారు. ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలని ఆదేశిం చారు. పౌరులనుంచి గ్రీవెన్స్‌లను పరిష్కారించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదని దిశానిర్దేశం చేశారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటి కప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని, తిరస్కరిస్తున్నప్పుడు ఎందు కలా చేశారో కచ్చితంగా చెప్పగలగాలన్నారు. నిర్ణీత సమయంలోగా గ్రీవెన్స్‌ పరిష్కారం కాకపోతే అది ఏస్థాయిలో నిలిచిపోయింది అన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని సూచించారు. స్పందన వినతుల పరిష్కారమనేది కలెక్టర్ల పనితీరుకు ప్రమాణంగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్‌ అడ్మినిస్ట్రేష్రన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, ఐటీ-, ఎలక్ట్రాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, సైన్స్‌ అండ్‌ -టె-క్నాలజీ కార్యదర్శి విజయకుమార్‌, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ నారాయణ భరత్‌ గుప్తా, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున, ఆర్టీజీఎస్‌ సీఈఓ జే విద్యాసాగర్‌ రెడ్డి ఇతర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement