Saturday, March 16, 2024

కరోనా నుంచి కోలుకున్న తాడికొండ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ శ్రీదేవి బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గినట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ తాను కోలుకోవాలని పూజలు చేసిన కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన డాక్టర్ శ్రీదేవి వెంట ఆమె భర్త, రాష్ట్ర వైద్య విభాగం ఎగిక్యుటివ్ మెంబర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్, తాడికొండ నియోజకవర్గ వైసీపీ నాయకులు ఆళ్ళ హనుమంతరావు తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement