Thursday, March 28, 2024

ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం – ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ కుమార్

తెనాలి :అభివృద్ధి, సంక్షేమం రెండూ రెండు కళ్ళుగా భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి రాష్ట్రంలో సువర్ణ పాలన అందిస్తున్నారని శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు అయిన సందర్భంగా స్థానిక రణరంగ చౌక్ సమీపంలోని దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందించారన్నారు. లబ్ధిదారులకు నేరుగా 86 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పాలన అందిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేలా ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శివకుమార్ విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్ చైర్మన్ మాలేపాటి హరి ప్రసాద్ వైసిపి నాయకులు దేసు శ్రీనివాసరావు, బూరెల దుర్గాప్రసాద్, కఠారి హరీష్ ,కిరణ్ కుమార్, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మన్నవ ప్రభాకర్,కాళిదాసు వెంకటేశ్వరరావు, జాకీర్ హుస్సేన్,గౌస్, కౌన్సిలర్లు సంజీవరెడ్డి,దుబాయ్ బాబు, ఇస్మాయిల్, విజయలక్ష్మి పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement