Friday, April 26, 2024

చీపురుప‌ట్టిన ఎమ్మెల్యే భూమ‌న‌..

తిరుపతి, : రోజువారి నగరపర్యటనలో భాగంగా స్థానిక భవాని నగర్ పరిసరాల్లో పర్యటించి పారిశుధ్యం పై మరింత అవగాహన కోసం కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో తమవంతు గా స్ధానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర రెడ్డి స్వయంగా రోడ్లను పరిశుభ్రపరిచారు. మన చుట్టుపక్కల శుభ్రత పాటించేలా ఉండాలని, ప్రజల్లో కోవిడ్ ను ఎదుర్కొనే ధైర్యం రావాలని, అత్యవసరం మినహా ఎవరూ బయటికి రాకూడదని, గుంపులు అసలే వద్దని స్థానికంగా ఉన్న ప్రజలకు సూచించారు. బయట వెళ్ళేటప్పుడు మాస్కు మూతి, ముక్కు కవరయ్యే విధంగా ఉండాలని, ఇదే మన మొదటి కరోనా వ్యాక్సిన్ అని తెలిపారు. ప్రభుత్వ సూచనలతో కర్ఫ్యూ అమలుకు సహకరించి కరోనా ను తరిమికొట్టాలి అన్నారు. వైద్యులు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు మనకోసం శ్రమిస్తున్నారని అన్నారు. నగరంలో కరోనా మొదలయిన నాటి నుండి డి.జె.సిస్టమ్ తో చైతన్యపరచడం, జె ఏ సి ఏర్పాటు తో అనాధ కోవిడ్ మృతదేహాలకు దహనక్రియలు, మెరుగైన వైద్యసేవలు అందేలా ఆసుపత్రుల పర్యటన వంటివి తమవంతుగా శాసనసభ్యులు కృషి చేస్తూ, అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement