Thursday, March 28, 2024

పిచ్చికుక్క కాటుకు… ఐదుగురు చిన్నారులకు గాయాలు

తాడేపల్లి : తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో పిచ్చి కుక్కల బెడద అధికంగా ఉందని గత కొంత కాలంగా దారినపోయే విద్యార్థుల మీద, వాహనదారులు మీద, స్థానిక ప్రజల మీద కుక్కలు తిరుగుబాటు చేసి గాయ పరుస్తున్నాయి. ఈ విష‌యంపై పంచాయతీలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బుధవారం గ్రామంలోని బోసుబొమ్మ సెంటర్, ముస్లిం బజార్ లో పిచ్చి కుక్క దాడి చేసి ఐదుగురిని గాయపరిచింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారని, పిచ్చికుక్క బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement