Friday, April 26, 2024

సున్నం బట్టీలో.. పొగ తట్టుకోలేక కార్మికుడు మృతి

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సున్నం బట్టీలోని పొగ తట్టుకోలేక బట్టీ కార్మికుడు మృతిచెందాడు. పట్టణంలోని శంకర్ కాట వెనుక గల బీఆర్ కే బట్టిలో పనిచేస్తూ పొయ్యి వద్ద సున్నం లాగుతుండగా వచ్చే పొగ వల్ల శ్వాస ఆగి పట్టణానికి చెందిన అంబురు నాగేశ్వరావు (36) మరణించాడు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలున్నారు. కాగా బట్టీ యాజమాన్యం ఇంత వరకు స్పందించలేదని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని .. మృతదేహంతో బట్టి వద్దే మృతుని బంధువుల ఆందోళన చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement