Wednesday, March 27, 2024

విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేక్…..

అమ‌రావ‌తి – జ‌గ‌న్ స‌ర్కార్ కు మ‌రోసారి హైకోర్టు షాక్ ఇచ్చింది… విశాఖలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది… విశాఖ‌ మహానగరంలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. గతంలో బిల్డ్ ఏపీ పేరున ఇలానే అమ్మకాలుకు ప్రయత్నించగా కోర్టు స్టే ఇచిందని పిటిషనర్ విన్నవించగా.. అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. అనంతరం టెండర్లు ఫైనలైజ్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement