ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకును దిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కటి బాజీ నారాయణ అనే వ్యక్తి మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నాడు. ఇప్పటివరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. చేబ్రోలుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోని ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం రెండు నెలల్లోనే మరో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అమెరికాకు వెళ్లి బీహార్ కు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ నిత్య పెళ్లికొడుకు. అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -